Naadaaniyan: ఖుషీ కపూర్ నటనపై ట్రోల్స్.. కరణ్ జోహార్ స్పందన 1 y ago
బాలీవుడ్ నటుడు సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ తెరంగేట్రం చేసిన చిత్రం 'నాదానియన్'. ఈ చిత్రంలో ఖుషీ కపూర్ కథానాయిక. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ నటనపై కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలు మరీ వాణిజ్య ప్రకటనలను గుర్తుచేసేలా ఉన్నాయని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వీటిపై కరణ్ జోహార్ స్పందించారు. విమర్శించడం సహజమేనని.. కానీ, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం సరికాదన్నారు. కఠినమైన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఖండించారు.